- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో దారుణం
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. రాఖీ పౌర్ణమి రోజున డెలివరీకి వచ్చిన గర్భిణీకి నర్సులే నార్మల్ డెలివరీ చేస్తుండగా పురిటిలోనే పసికందు మృతి చెందింది. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన పూదరి శ్రావణి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం 10:00కి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ అడ్మిట్ చేసుకుని నార్మల్ డెలివరీ అవుతుందని తెలిపారు. రాత్రి 8 గంటలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో నర్సులు థియేటర్ కు తీసుకువెళ్లారు. రాత్రి పది గంటలకి పాప పుట్టగా.. పాప పరిస్థితి బాగాలేదని, MGMకు తీసుకువెళ్లాలని శ్రావణి భర్త పవన్ కి చెప్పారు. పాప కదలిక లేకపోవడంతో నర్సులను నిలదీయగా.. ఆమె స్పృహ లేదని, వెంటనే ఎంజీఎంకు తీసుకువెళ్లాలని సూచించారు. 108లో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు పాప మృతి చెందిందని నిర్ధారణ చేశారు. శనివారం ఉదయం బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు డాక్టర్ల పేర్లు చెప్పమంటే ఎవరు చెప్పకుండా దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.