- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గల్ఫ్లో ఆత్మనగర్ వాసి మృతి
దిశ, మెట్పల్లి రూరల్: మెట్పల్లి మండలంలోని ఆత్మనగర్ గ్రామానికి చెందిన వెళ్లుల్ల రాజశేఖర్(42 ) అనే యువకుడు వారంరోజుల క్రితం అబుదాబీలో గుండెపోటుతో మృతిచెందగా శనివారం గల్ఫ్ జేఏసీ సహకారంతో మృతదేహం ఆత్మనగర్ గ్రామానికి చేరగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాలకు వెళితే బతుకుదెరువు నిమిత్తం అప్పుచేసి 11 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశం వెళ్లి చాలిచాలని జీతంతో ముందుకుసాగుతూ ఇటివలే డ్రైవర్ గా విధుల్లోకి చేరగా హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. రాజశేఖర్ మృతుదేహాన్ని ఇండియాకు రప్పించడానికి ఆత్మనగర్ గ్రామ సర్పంచ్ జరుపుల శ్రీనివాస్, జగ్గాసాగర్ మాజీ ఎంపీటీసీ పుల్ల జగన్ ద్వారా గల్ఫ్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ గంగుల మురళీధర్ రెడ్డిని సంప్రదించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం, జేఏసీ సహకారంతో కంపెనీవారు మృతదేహాన్ని పంపడంలో స్వయంగా ముందుకొచ్చారు. మృతుడి భార్య గంగామణి బీడీ కార్మికురాలు. అదేవిధంగా అతనికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వాం అన్ని విధాలు కోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.