ఆశా వర్కర్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

by Aamani |
ఆశా వర్కర్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండల ఆశా వర్కర్లను పోలీసులు మంగళవారం బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సైదాపూర్ మండల ఆశా వర్కర్లను సైదాపూర్ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కనీస వేతనం రూ 18 వేలు చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ లో నిర్వహించే ధర్నాకు తరలి వెళ్తున్న తమను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed