- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
చెరువు మాయం.. అధికారులు మౌనం
by Disha Web |

X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో అగ్రహారం కుంట చెరువుకు సంబంధించి సుమారు 10 ఎకరాల 26 గుంటల భూమి కబ్జాకు గురవుతూ వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ చెరువు నీళ్లతోనే రైతుతు పంటలు పండించుకునేవారని, ముదిరాజులు అందులో చేపలు పట్టుకొని జీవనం సాగించేవారని అన్నారు. అయితే ఈ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో కులవృత్తి కోల్పోయామని ముదిరాజులు వాపోయారు. తమ భూమి తొమ్మిది సంవత్సరాల నుండి కబ్జాకు గురవుతూ వస్తోందని వాపోయారు. దాంట్లో పంట పొలాలు వేసుకుంటూ చెరువు లేకుండా చేశారు అని అగ్రహారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కబ్జాకు గురైన 10 ఎకరాల 26 గుంటల భూమిని తిరిగి తమకు అప్పగించాలని అగ్రహారం ప్రజలు కోరుతున్నారు.
Next Story