- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంగాలపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన పి.శంకర్, కె.శ్రీనివాస్ ఇద్దరు ఆటోల్లో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరిస్తుండగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ మారుతి తన సిబ్బంది కలిసి జిల్లెళ్ల గ్రామ శివారులో వారిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆటోలను, రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ మారుతి మాట్లాడుతూ పేదలకు అందవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై రాజేష్, తిరుపతి, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.