KCR, జగన్ డ్రామాలకు త్వరలోనే చరమగీతం: జ్యోత్స్న

by Disha Web Desk 19 |
KCR, జగన్ డ్రామాలకు త్వరలోనే చరమగీతం: జ్యోత్స్న
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, జగన్ డ్రామాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడనున్నారని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అంతర్ నాటకానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెరతీయాలన్నారు. సెంటిమెంట్‌ను మళ్లీ రెచ్చగొట్టి తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణా రెడ్డి అప్పుడు, ఇప్పుడు సమైక్యంగా ఉండాలనేదే మా కోరిక అని మాట్లాడటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల సీఎంలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ఏపీలో జగనన్న రాజ్యామంటూ రాక్షస రాజ్యాన్ని తెచ్చారని, తెలంగాణలో కేసీఆర్ ప్రజాకంఠక పాలన తెచ్చారని మండిపడ్డారు. జగన్ చీడ, కేసీఆర్ పీడ తెలుగు రాష్ట్రాలకు పట్టుకుందని.. ఇవి ఎప్పుడు వదిలిపోతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రం రెండు ముక్కలు కాకపోయేదని ఆనాడు మాట్లాడిన షర్మిల.. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి వైఎస్ఆర్ కారణమని మాట్లాడటం దొంగనాటకాలు కావా? అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో ఇటు కేసీఆర్ కూతురు, అటు జగన్ బినామీ ఇద్దరు కూరుకుపోయారని పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రెండు రాష్ట్రాలను అప్పుల ఊబీలో నెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.



Next Story

Most Viewed