SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి: వెంకట్

by Disha Web Desk 2 |
SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి: వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్​పార్టీ పోరాడుతుందని ఎన్ఎస్‌యూఐ స్టేట్​చీఫ్ బల్మూరి వెంకట్ అన్నారు. తాము చేసిన పోరాటం వలనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు ఇక ఖతమైనట్టేనని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాబోతున్నదని వివరించారు. నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలుపుతూ టీఎస్ ఎల్​పీఆర్బీ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం కలిగించిందన్నారు. మరోవైపు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కూడా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.


Next Story

Most Viewed