'రిజర్వేషన్‌లపై సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం'

by Vinod kumar |
రిజర్వేషన్‌లపై సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించించడం అభినందనీయమని రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్ రెడ్డి, కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి‌లు హర్షం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం వల్ల లక్షలాది మంది అగ్ర వర్ణ పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సముచిత స్థానం దక్కిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఓసీ సంఘాల, రెడ్డి జేఏసీ పోరాటాల ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందన్నారు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్లు వాదించగా.. రిజర్వేషన్లను ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీలు సమర్థించడం అగ్రవర్ణ పేదలకు తీపి కబురు లాంటిదని వివరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, ఈ రిజర్వేషన్లు చట్టబద్ధమేనని, న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించడం రెడ్డి జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ ఉందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed