- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డేంజర్లో తెలంగాణ.. మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత

దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత (Sun intensity) అధికంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని సూచించిచారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొవాలని, నిత్యం శరీరానికి నీటిని అందించాలని, ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకొవాలని తెలిపారు. అలాగే కాటన్(వైట్) వస్త్రాలను ధరించాలని సూచించారు. ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ నమోదు అయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ 44.6, నిజామాబాద్, 45, రామగుండం 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజు తీవ్రమైన ఎండలతో పాటు.. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.