నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం.. అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్

by Disha Web Desk 6 |
నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం.. అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నాసిరకం పత్తి విత్తనాలను అమ్మటానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసారు. వీరి నుంచి 85 లక్షల రూపాయల విలువ చేసే బీజీ-3/హెచ్టీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

నాసిరకం విత్తనాల దందాను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఇటీవల డీజీపీ అంజనీ కుమార్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఈ దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. బాలానగర్, రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందాలు, బాచుపల్లి, బాలానగర్, షాబాద్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్ట్ చేసి 2.65 టన్నుల నాసిరకం పత్తి విత్తనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మాలని నిందితులు అనుకున్నారు.


Next Story

Most Viewed