- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జర్నలిస్టులందరికీ ఇందరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ప్రెస్ అకాడమీని తిరిగి ఓపెన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి (Nampally)లోని ప్రెస్ అకాడమీ (Press Academy)లో జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్ (Pension), ఎక్స్ గ్రేషియా (Exgratia)కు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Press Academy Chairman Srinivas Reddy) సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విధినిర్వహణలో చనిపోయిన, అనారోగ్యం బారిన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారని అన్నారు.
ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇక విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కోట్లను ఫీక్సడ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందని, జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ. 22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000 లతో పాటు అయిదు సంవత్సరాల వరకు, నెలకు రూ.3000 ల చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల క్రింద 1 నుండి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు 1,000 ల చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8,98,39,000 లు ఆర్థిక సహాయం అందించండం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.