తెలంగాణ రాష్ట్రం వణుకుతోంది..

by samatah |
తెలంగాణ రాష్ట్రం వణుకుతోంది..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. చలి తీవ్రతకు పట్టణ, పల్లె ప్రజలు గజగజ వణికి పోతున్నారు. నవంబర్ మొదటి వారంలో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని కరీంనగర్, జగిత్యాల హైదరాబాద్, నిజమాబాద్, మేడ్చల్, నిర్మల్ యాదాద్రి జిల్లాలకు IMD-H ఎల్లో అలర్ట్ జారీచేసింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా, ఈనెలలో ఇప్పటికే కనిష్ఠంగా 19.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, రాబోయే నాలుగు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది.



Next Story

Most Viewed