'వైఎస్ షర్మిలను చంపే కుట్ర చేస్తున్నారు'

by Dishanational1 |
వైఎస్ షర్మిలను చంపే కుట్ర చేస్తున్నారు
X

దిశ, ముషీరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని కుత్బుల్లాపూర్ వైఎస్సార్ టీపీ కో- ఆర్డినేటర్ రామ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రామ గౌడ్ వైఎస్సార్ టీపీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిలను చంపే కుట్ర చేస్తున్నారని, ప్రజల్లో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. షర్మిలకు ఏమైనా నైతిక బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ నేతలు నాని, రాజ్ కుమార్, రవి, అంజి, నవీన్, చిన్నా, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story