నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా

by Disha Web Desk 15 |
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
X

దిశ, శేరిలింగంపల్లి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి మరోసారి తనకు చేవెళ్ల ఎంపీగా అవకాశం కల్పించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో పలు కాలనీ అసోసియేషన్ సభ్యులతో రంజిత్ రెడ్డి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్​ఛార్జీ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని,

ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయింద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలు క‌నుమ‌రుగ‌య్యాయని, కార్పొరేట్ శ‌క్తుల కోస‌మే బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని విమర్శించారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మ‌రించార‌ని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed