మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్

by Disha Web Desk 15 |
మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్
X

దిశ, బేగంపేట : బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిన ప్రయాణికురాలిని రైల్వే రక్షక దళం పోలీసులు రక్షించారు. రైలు కింద పడబోతుండగా సరస్వతి అనే ప్రయాణికురాలిని రైల్వే పోలీసు కానిస్టేబుల్ సరిత సురక్షితంగా కాపాడారు. నాంపల్లి జీఆర్పీఎఫ్ ఇన్​స్పెక్టర్ కథనం ప్రకారం లింగంపల్లి ఫలక్ నామా ఎంఎంటీఎస్ రైలు బేగంపేట రైల్వే స్టేషన్ లో కదులుతుంది. ఈ సమయంలో రైలు ఎక్కుతున్న క్రమంలో సరస్వతి అదుపుతప్పి కింద పడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షక దళం పోలీస్ కానిస్టేబుల్ సరిత హుటాహుటిన సరస్వతిని అక్కడి నుండి లాగేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో సరస్వతి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సరితను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.


Next Story