- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లిఫ్ట్ అడిగిన మైనర్ బాలిక కిడ్నాప్.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి..

దిశ, చార్మినార్: సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్లో మైనర్బాలిక సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో ఉండగానే.. పహాడి షరీఫ్లో లిప్ట్ అడిగిన 12 ఏళ్ళ మైనర్బాలికపై కీచకులు పంజావిసిరారు. కారులో మైనర్ బాలికను కిడ్నాప్చేసి, ఓ ఇంట్లో అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని మొఘల్పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మొఘల్పుర ఇన్స్పెక్టర్ రవికుమార్తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని సుల్తాన్షాహీ ప్రాంతంలో తన తాత, అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న మైనర్బాలిక (12) స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం పహాడిషరీఫ్లోని షాహిన్నగర్ప్రాంతంలో నివాసముంటున్నారు.
ఈ నెల 31 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా షాహిన్నగర్లోని తన తల్లిదండ్రుల దగ్గరికి కాలినడకన బయలుదేరింది. రాత్రి 8 గంటల వరకు 10 కిలోమీటర్ల దూరం నడిచింది. పహాడి షరీఫ్కమాన్వద్దకు చేరుకోగానే అలసిపోయిన బాలిక లిఫ్ట్కోసం ఎదురు చూడసాగింది. అటుగా వస్తున్న క్యాబ్ను లిఫ్ట్అడగగా.. బహదూర్పురా కు చెందిన క్యాబ్డ్రైవర్షేక్ఖలీం (34) తన కారులో షాహిన్నగర్లో వదిలి పెడతానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఒంటరిగా ఉన్న బాలిక పై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని పథకం వేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెబుతూ.. రెండు గంటల పాటు పహాడీ షరీఫ్పరిసర ప్రాంతంలోనే కారును తిప్పుతూ కాలయాపన చేశాడు.
కిషన్బాగ్కు చెందిన డైరీ ఫాం నడుపుకునే తన స్నేహితుడు లుక్మాన్(34) కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ బాలికను కిడ్నాప్చేసి క్యాబ్లో లుక్మాన్సొంతూరు రంగారెడ్డి జిల్లా షాద్నగర్సమీపంలోని కుందుర్గ గ్రామంలోని ఇంటికి తీసుకువెళ్ళారు. షేక్ఖలీం, లుక్మాన్లు ఒంటరి మైనర్బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.
బాలిక ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టింది. దీంతో వెంటనే లుక్మాన్ఇక్కడి నుంచి బాలికను తీసుకెళ్ళు అంటూ షేక్ ఖలీం కు చెప్పారు. బాలికను తీసుకుని కారులో బయలుదేరిన క్యాబ్ డ్రైవర్షేక్ఖలీం జూన్1వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు మొఘల్పుర పోలీస్స్టేషన్వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. విషయాన్ని గమనించిన మొఘల్పుర పోలీసులు బాలికను ఆరాతీయగా జరిగిన విషయాన్ని వివరించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బాలిక మొఘల్పురా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికను భరోసా సెంటర్కు పోలీసులు తరలించారు.
అంతకుముందే మొదట బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొఘల్పుర పోలీసులు మిస్సింగ్కేసును నమోదు చేశారు. అనంతరం బాలిక ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసును మార్చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్న షేక్ ఖలీం, లుక్మాన్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.