రాజేష్, సుజాత మృతి కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది : రాచకొండ సీపీ చౌహన్

by Disha Web Desk 15 |
రాజేష్, సుజాత మృతి కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది : రాచకొండ సీపీ చౌహన్
X

దిశ, ఎల్బీనగర్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం లభ్యమైన రాజేష్ మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్ లో ఎలాంటి గాయాలు లేవని రాజేష్, సుజాతకు సంబంధం ఉందని ఆధారాలు సేకరించామని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ తెలిపారు. సుజాత కొడుకు జయచంద్రకు రాజేష్ విషయం తెలియడంతో రాజేష్ ను కొట్టాడని, రాజేష్ ప్రతిరోజూ సుజాత ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడని వెల్లడించారు. ఒకేరోజు ఇద్దరు పురుగుల మందు తాగలేదని, వయసు రీత్యా తేడా ఉండడంతో సుజాత అక్రమ సంబంధానికి నిరాకరించిందని తెలిపారు. రాజేష్ వేధింపులు అధికం కావడంతో మొదట సుజాత పురుగుల మందు తాగిందన్నారు. రాజేష్, సుజాత మృతి కేసు ఇంకా దర్యాప్తులో ఉందని పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని పేర్కొన్నారు.


Next Story

Most Viewed