- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆరు రాష్ట్రాల్లో సైబర్ క్రైం పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. రీఫండ్ అమౌంట్ చూస్తే షాక్

దిశ, సిటీక్రైం : సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల భరతం పట్టేందుకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ నెలలో దేశంలోని 6 రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ తో సైబర్ క్రైం పోలీసులు 24 మందిని అరెస్ట్ చేశారు. వీరి చేతుల్లో మోసపోయిన బాధితులకు 1.49 కోట్లు తిరిగి వచ్చేలా చేశారు. ఈ 24 మంది నిందుతులు దేశవ్యాప్తంగా 313 కేసుల్లో మోసాలకు పాల్పడగా తెలంగాణలో 54 మందిని కొల్లగొట్టారని పోలీసులు దర్యాప్ర్హులో ఆధారాలు సేకరించారు.
స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్స్, ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్ పేరుతో డిజిటల్ అరెస్ట్, క్రెడిట్ కార్డు, కస్టమర్ కేర్, ఏపీకే ఫైల్ మోసాలకు పాల్పడి అమాయకులను బురిడీ కొట్టించారని విచారణలో తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లల్లో వచ్చే గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్, ఫోన్ కాల్స్ ను నమొద్దన్ని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ -11, బీహార్ -1, మధ్యప్రదేశ్-1, మహారాష్ట్ర-5, ఉత్తర్ ప్రదేశ్-3, వెస్ట్ బెంగాల్-3 ని అరెస్ట్ చేశారు. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు మొదటి గంటలో 1930 కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే సైబర్ క్రిమినల్స్ కొట్టేసిన నగదును రాబట్టేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు వివరిస్తున్నారు.