ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by samatah |   ( Updated:2022-07-04 13:50:44.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఓ ఆర్ ఆర్ రోడ్డు పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఇక కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో మృతదేహాలు కారులోనే చిక్కుక పయాయి. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed