అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ అధికారులు

by Sumithra |   ( Updated:2025-05-09 14:40:58.0  )
అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ అధికారులు
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా సర్వేనెంబర్ 27లోని ప్రభుత్వ భూముల్లో కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడి, అందులో నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుతో శుక్రవారం ఆర్ఐ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం ఖాజాగూడా సర్వే నెంబర్ 27లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే సహించబోమని, వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed