- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పదేండ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి.. : మంత్రి కోమటిరెడ్డి
దిశ,ఖైరతాబాద్ : బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్స్ కూడా తనను సంప్రదించారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ కు శాశ్వతంగా తాళం పడుతుందని , బీఆర్ఎస్ నుంచి 70 శాతం మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 14 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు.
ఒకటి రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు . రాష్ట్రంలో డీలిమిటేషన్ తర్వాత 119 నియోజకవర్గాలు 154 కు పెరుగుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టామని, తాను మూడు రోజులు తనకు కేటాయించిన రూం నుంచి కాలు బయట పెట్టలేదని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నానని కొందరు ప్రచారం చేశారని, తాను ఎక్కడికి వెళ్లలేదని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కాదు మంత్రి పదవి కావాలని కూడా ఢిల్లీకి పోలేదని చెప్పారు. ఇంకా పదేండ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని అన్నారు.