- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉస్మానియాలో అరుదైన వైద్యం

దిశ, కార్వాన్ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు ఓ బాలుడికి కాలేయ మార్పిడి చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు. చిన్న వయస్సులోనే అరుదైన కాలేయ వ్యాధితో పాటు 'ఊపిరితిత్తులు,ఇతర అవయవాలతో బాధపడుతున్న ఓ బాలుడికి ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యులు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారికే కాలేయ మార్పిడి సాధ్యమవుతుంది. అలాంటిది క్లిష్టమైన స్థితిలో ఉన్న బాలుడికి కాలేయ మార్పిడి సవాలుగా తీసుకున్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంటమాలజీ విభాగం వైద్యులు బాలుడి తల్లిలో నుంచి సేకరించిన సగం కాలేయాన్ని సేకరించి బాలుడికి అమర్చి అతన్ని కాపాడారు. కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.కోటి విలువ చేసే ఖరీదైన శస్త్ర చికిత్సను పూర్తి విజయవంతంగా పూర్తి చేసి పునర్జన్మనిచ్చినట్లు గురువారం వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం ప్రాంతానికి చెందిన బాలుడు (17) నిరుపేద కుటుంబం బాల్యం నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వయస్సు పెరిగే కొద్దీ చేతి వేళ్లు పొడుగ్గా పెరగడం ఎత్తుతో పాటు ఛాతీ,కాళ్లు పెరగడం.. జబ్బులు, వంటి ఇతర అనారోగ్య సమస్యలు బాధించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు నెల రోజుల క్రితం ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. చిన్న వయస్సు రకరకాల అనారోగ్య సమస్యలతో ఉండటంతో ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటమాలజీ విభాగాధిపతి డా. మధుసూదన్ కేసును సవాల్గా తీసుకున్నారు. యూనిట్ లో చేర్పించి వివిధ రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, అనస్థీషియా వంటి వివిధ విభాగాల వైద్యుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని డా. మధుసూదన్ తెలియజేశారు. పొరుగు రాష్ట్రమైన ఉస్మానియా సూపరింటెండెంట్ డా. రాకేశ్ శేయ్ మానవతా దృక్పథంతో స్పందించి ఖరీదైన మందులు, ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. కాలేయంతో పాటు ఊపిరితిత్తులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.