- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్లమెంట్ ఎన్నికలు మనకు ఫైనల్
దిశ, శేరిలింగంపల్లి : అసెంబ్లీ ఎన్నికలు కేవలం సెమీ ఫైనల్ మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని, సెమీ ఫైనల్ లో 420 కేసీఆర్ ను ఓడించామని, ఇప్పుడు కేడీ మోడీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శేరిలింగంపల్లి తారానగర్ లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్ కు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించామని, పార్లమెంట్ ఎన్నికల్లో దేశానికి పట్టిన శనిని వదిలించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ తన పదేళ్ల పాలనలో దేశాన్ని అథోగతి పాలు చేశారని, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని, రాష్ట్రాన్నికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్, సత్యనారాయణ రావు, రఘునాథ్ యాదవ్, జెరిపేటి జైపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.