- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆయిల్ దిగుమతుల సుంకాన్ని పెంచాలి

దిశ, దమ్మపేట : ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని పెంచాలని కోరుతూ హైదరాబాద్ రాజేందర్ నగర్ లో జరిగిన జీ-20 సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేంద్ర సింగ్ తోమర్ ను, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావులను కలిసి రాష్ట్ర ఆయిల్ ఫామ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఇటీవల వంట నూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నూనెల పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో వంట నూనె ధరలు కాస్తంత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పూర్తిగా జీరో శాతానికి తగ్గించడం ద్వారా పామాయిల్ గెలల ధర తగ్గి రూ.13 వేలకు చేరుకుందని, తద్వారా ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు ఆయిల్ గెలల ధర తగ్గడంతో రైతుల నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల నియంత్రించడానికి, మరియు దేశీయ రైతులకు అవసరమైన విదేశీ పోటీ నుంచి రక్షించడానికి డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజంను రూపొందించాలని వివరించారు.
అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంటను ప్రవేశపెట్టిన సమయంలో రైతులకు ప్రోత్సాహాలు అందజేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఎలాంటి ప్రోత్సాహాలు అందించకపోవడం, ఆయిల్ పంట ధరలు పెంచకపోవడం వల్ల దేశంలో 1,20,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను నరికి వేశారని వివరించారు. దేశంలో ఉన్న రైతులు ఇండోనేషియా మలేషియా రైతులతో పోటీ పడలేకపోతున్నారని, ప్రస్తుతం పామాయిల్ గెలలు టన్ను ధర 13 వేల రూపాయలు ఉన్నదని, ఎరువుల ధరలు పెరగడం ద్వారా ఈ ధర తో ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు అవ్వట్లేదని, ఆ ధరను 19 వేలు చేయాలని కోరారు. దీంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై స్టడీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవడం కోసం లేఖ రాస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.