నూతన నటనా సౌజన్య మూర్తి దివ్యవాణి

by Disha Web Desk 15 |
నూతన నటనా  సౌజన్య మూర్తి దివ్యవాణి
X

దిశ, అంబర్ పేట్ : వెండితెరపై నూతన నటన వైభవాన్ని ఆవిష్కరించిన సౌజన్య మూర్తి దివ్యవాణి అని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణు గోపాలచారి అన్నారు. పద్మశ్రీ ఘంటసాల, ఎన్టీ రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ప్రముఖ గాయకుడు, సామాజిక వేత్త శశి (ఆస్ట్రేలియా) ఎన్టీఆర్ స్వరమాధురి సేవా పురస్కారం, ప్రముఖ సినీనటి దివ్యవాణి కి ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో స్వరమాధురి సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాలచారి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు వైవిధ్య భరితమైన

పాత్రలు ధరించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ పురస్కారం దివ్యవాణి కి అందజేయడం సమచితమన్నారు. శశి ఆస్ట్రేలియాలో స్థిరపడి తెలుగు వారికి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సభకు ముందు సాయిపావని నిర్వహణలో ప్లే బ్యాక్ సింగర్ ప్రణయ్ కుమార్, పవన్ కుమార్, రమణారెడ్డి, బైరి శ్రీనివాస్, సుజారమణ, లక్ష్మీ వాణిశ్రీ, రమాదేవి, ఇంద్రాణి, చంద్ర జ్యోతి, మల్లెల వసుంధర ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆకృతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ప్రొప్రైటర్ కే.గిరి, స్వర కిన్నెర సీహెచ్ త్రినాధరావు, రవి కాంత్, గాయకుడు అమీన్ పాషా, రఘునందన్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed