- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రారంభమైన ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్ర
దిశ, కార్వాన్ : శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ విశాల్ శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. దూల్ పేట్ లోని ఆకాష్ పూరి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాణి అవంతి భాయ్ భవనం నుండి రాజాసింగ్ భారీ విశాల్ శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ బంధు మిత్రులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. 2010 లో మొదలు పెట్టిన శ్రీ రామ నవమి శోభాయాత్రను చూసి దేశవ్యాప్తంగా ప్రారంభించారని పేర్కొన్నారు.
ఈ ఏడాది రాజా సింగ్ శోభాయాత్రను నిర్వహించలేడని ఎన్నో శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించాయని, కానీ హిందూ బంధువుల ఆశీర్వాదంతో యాత్రను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే శోభాయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా శోభాయాత్రను కొన సాగిస్తాను అన్నారు. పెద్ద ఎత్తున యువకులు , రామ భక్తులు , మహిళలు రాణి అవంతి భాయ్ భవనం చేరుకొని రాజాసింగ్ శోభాయాత్రలో పాల్గొన్నారు. భారీ పోలీసుల బలగాలతో శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు సాగుతోంది. దూల్పేట్, మంగళహాట్, పురాణాపూల్ గాంధీ విగ్రహం ప్రాంతాలలో రామభక్తులతో కిక్కిరిసిపోయింది.