ప్రగతి భవన్‌లో అతిథులకు అల్పాహారం.. ఇంకొంచెం ఇంకొంచెం తినండంటూ కేసీఆర్....

by Dishanational1 |
ప్రగతి భవన్‌లో అతిథులకు అల్పాహారం.. ఇంకొంచెం ఇంకొంచెం తినండంటూ కేసీఆర్....
X

దిశ, వెబ్ డెస్క్: అతిథులకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల బృందం ప్రగతి భవన్ కు చేరుకుంది. ప్రగతి భవన్ కు చేరుకున్న ఈ బృందాన్ని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.






Next Story