రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ జర్నలిస్టుల నిరసన

by Disha Web Desk 15 |
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ జర్నలిస్టుల నిరసన
X

దిశ, వనస్థలిపురం : రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో అన్యాయం జరుగుతోందని, గత కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఎల్బీనగర్ వర్కింగ్ జేఏసీ సభ్యులు శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తమ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జేఏసీ చైర్మన్ దిశ రాజు, కో చైర్మన్ ధర్మనాయక్, శ్రీరాములు, బాల చారీ, రాజు పాల్గొన్నారు.



Next Story

Most Viewed