Crime News : నారాయణ కాలేజీలో దారుణానికి Principal చేసిన ఈ పనే కారణం?

by Dishanational2 |
Crime News : నారాయణ కాలేజీలో దారుణానికి Principal చేసిన ఈ పనే కారణం?
X

దిశ, వెబ్‌డెస్క్ :హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. అయితే కళాశాలలో ఇంటర్ విద్యార్థి అయిన నారాయణ స్వామి టీసీ ఇవ్వమని ప్రిన్సి పాల్‌ని కోరగా, టీసీ ఇవ్వకుండా ప్రిన్సిపాల్ వేధిస్తుడటంతో, మనస్థాపానికి గురైన విద్యార్థి ఏకంగా ప్రిన్సిపాల్ గదిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ప్రిన్సిపాల్ గదిలో నిప్పంటించుకున్నాడు, అంతటితో ఆగకుండా ఏకంగా మంటలతోనే వెళ్లి ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఇక ఈ ప్రమాదంలో ప్రిన్సిపాల్ సుధాకార్ రెడ్డి, ఏవో ఆశోక్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని కాలేజీ యాజమాన్యం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి సూసైడ్ అటెమ్ట్‌తో కాలేజీలో ఉద్రికత్త వాతావణం చోటు చేసుకుంది.


Next Story