శారదా విద్యాలయంలో క్రీడా మైదానం ప్రారంభం

by Disha Web Desk 11 |
శారదా విద్యాలయంలో క్రీడా మైదానం ప్రారంభం
X

దిశ, చార్మినార్: పాతబస్తీ అలియాబాద్​లోని శారదావిద్యాలయంలో క్రీడా మైదానాన్ని మంగళవారం నగర పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​, మాజీ భారత క్రికెట్‌ జట్టు టెస్ట్‌ క్రికెటర్‌ వెంకటపతి రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్​ సీవీ ఆనంద్​ బ్యాట్​తో సందడి చేశారు. అనంతరం వందేళ్ల శారదావిద్యాలయం చరిత్ర తెలిపే ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. క్రికెట్‌ అభిమానుల కోసం ఐదు నెట్స్‌తో పాటు బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు, అథ్లెటిక్స్‌, స్పోర్ట్స్‌ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ మరియు నోహ్‌ సాఫ్ట్‌ వ్యవస్థాపకులు మైనేని, శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న, అంగారా సైతం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed