- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
శారదా విద్యాలయంలో క్రీడా మైదానం ప్రారంభం
by Disha web |

X
దిశ, చార్మినార్: పాతబస్తీ అలియాబాద్లోని శారదావిద్యాలయంలో క్రీడా మైదానాన్ని మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ భారత క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెటర్ వెంకటపతి రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సీవీ ఆనంద్ బ్యాట్తో సందడి చేశారు. అనంతరం వందేళ్ల శారదావిద్యాలయం చరిత్ర తెలిపే ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. క్రికెట్ అభిమానుల కోసం ఐదు నెట్స్తో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు మైనేని, శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న, అంగారా సైతం తదితరులు పాల్గొన్నారు.
Next Story