రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యం: గీతామూర్తి

by Seetharam |
రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యం: గీతామూర్తి
X

దిశ, అంబర్ పేట్: మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి జోస్యం చెప్పారు. మునుగోడులో ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించే అంశాలు, ప్రణాళికలపై మహిళా మోర్చా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మునుగోడు ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించడానికి మహిళా మోర్చా కృషి చేస్తుందని చెప్పారు. ఎన్నికలలో భాగంగా ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story