- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్..

దిశ, సికింద్రాబాద్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.50లక్షల విలువ చేసే 2.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా వారి వద్ద 2.350 కిలోల గంజాయి లభించింది. గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఫరీదా ఖాన్, ఎండి సలాం, ఎండి సల్మాన్, ఆసిస్ ఖాన్ అరెస్ట్ చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో 2.350 కేజీల గంజాయి పట్టుబడినట్లు సీఐ తెలిపారు. గంజాయి తో పాటు బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎన్ ఫోర్స్ మెంట్ టీమును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.