- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాత్రైనా ఆగని ఓయూ విద్యార్థుల ఆందోళన.. స్పందించని వీసీ

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ మొదటి సంవత్సరం విద్యార్థినులు హాస్టల్ మూసివేయకూడదంటూ లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై ఉదయం నుంచి రాత్రి వరకు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఓయూ అధికారులు వచ్చి సముదాయించిన విద్యర్డినులు వినకుండా వీసీ వచ్చి సమస్యకు పరిష్కారం చూపే వరకు ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో హాస్టళ్లు మూసివేయడం ఏంటని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాస్టళ్లను మూసివేస్తున్నారని మండిపడ్డారు.
సెమిస్టర్ పరీక్షలు అయిన వెంటనే మెస్లు మాత్రమే మూసివేసి, హాస్టల్స్ మాత్రం తెరిచి ఉండేవన్నారు. ఇప్పుడు మాత్రం మెస్తో పాటు హాస్టళ్లను కూడా మూసి వేసి సామాన్లు సర్దుకుని వెళ్ళమనడం బాధాకరం అన్నారు. వర్సిటీ వీసీ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఊరుకునేది లేదని విద్యార్దినిలు రోడ్డుపై కూర్చున్నా వీసీ పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పేద విద్యార్దులు పట్ల కనీసం మానవత్వం చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.