గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు

by Sridhar Babu |
గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు
X

దిశ, మెహిదీపట్నం : గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టెంపుల్ చైర్మన్ జగదీష్ యాదవ్, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ప్రజలందరూ అమ్మవారి కరుణతో సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా చారి, మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి, శ్రీకాంత్ చారి, నర్సింగ్ రావు, శివశంకర్, వినోద్, విజయ్, రాజు, రవి, అశోక్, సర్వేశ్, ప్రశాంత్ పెద్ద సంఖ్యలో భక్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed