ప్రధానికి పోస్ట్ కార్డు పంపించిన డిప్యూటీ మేయర్

by S Gopi |
ప్రధానికి పోస్ట్ కార్డు పంపించిన డిప్యూటీ మేయర్
X

దిశ, సికింద్రాబాద్: చేనేతపై కేంద్రప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని నగర డిప్యూటీ మెయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టుకార్డు పంపించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వృత్తులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతూ ప్రధానికి ఉత్తరం పంపిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed