హైదరబాద్‌లో కొత్తరకం సైబర్ అటాక్

by samatah |
హైదరబాద్‌లో కొత్తరకం సైబర్ అటాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరబాద్‌లో కొత్తరకం సైబర్ అటాక్ చేసింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు ఉద్యోగులు సైబర్ దాడులు చేశారు. ప్రముఖ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిపారు కేటుగాళ్లు. కంపెనీపై దాడి చేసి రహస్యంగా డేటా చేజిక్కించుకున్నారు. అయితే కంపెనీలోని ఉద్యోగులే గత కొన్నేళ్లుగా సైబర్ అటాక్‌ చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీకి సంబంధించిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి రివాల్వర్‌తో పాటు 10 బులెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story