కాంగ్రెస్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంది: రంజిత్ రెడ్డి

by Disha Web Desk 12 |
కాంగ్రెస్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంది: రంజిత్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ తో కలిసి బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్, కావూరి హిల్స్, అయ్యప్ప సొసైటీ కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎంపీగా గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు. మీరు అవకాశం కల్పిస్తే పార్లమెంట్ లో మీ గొంతుకై ఉంటానని, జీవితాంతం ప్రజా సేవకే అంకితం చేస్తానని, పార్లమెంట్ కు వెళ్లే అవకాశం ఇవ్వండి అని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. మీ సహకారం ఉంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ గెలుపుకు పక్క అని రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story