స్వరూపానందస్వామీజీ సేవలో సీఎం కేసీఆర్​

by Disha Web Desk 15 |
స్వరూపానందస్వామీజీ సేవలో సీఎం కేసీఆర్​
X

దిశ, శేరిలింగంపల్లి : విశాఖ శారద పీఠపాలిత శ్రీ స్వరూపానంద స్వామీజీని కలిసేందుకు చందానగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఉదయమే గోపన్ పల్లిలో స్వరూపానంద స్వామీజీతో కలిసి బ్రాహ్మణ సేవా సదన్ ను ప్రారంభించారు. సాయంత్రం మరోసారి ప్రత్యేకంగా స్వామీజీని కలిసేందుకు వచ్చారు.

ఉదయమే స్వామీజీని కలిసిన సీఎం ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే ప్రగతి భవన్ నుండి నేరుగా చందానగర్ కు రావడం వెనక కారణాలు ఏమై ఉంటాయన్నదానిపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. అయితే అంధ్రప్రదేశ్ లో ఓసారి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, మరోసారి పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బ్రాహ్మణ సమాజానికి, అలాగే హిందువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవలను స్వరూపనంద స్వామీకి వివరించారని, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారని సమాచారం.


Next Story

Most Viewed