- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి: నరేంద్రసింగ్ తొమర్
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుకు చేసే మేలు జాతి సంపద సృష్టికేనని, అది రైతు కుటుంబానికో, రైతుకో ఇచ్చినట్లు కాదన్నారు. ప్రభుత్వాలు రైతుకు చేయూతనిస్తేనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. భారత్ వ్యవసాయరంగంపైనే ఆధారపడి ఉందని, కేంద్రమైన, రాష్ట్రమైనా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలన్నారు. గత 9 ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం అందించి దానిని దేశానికి ఒక దిక్సూచిలా అభివృద్ధి చేశామన్నారు. సాగునీటిపై దృష్టిపెట్టి ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులు, కుంటలు పునరుద్దరించామని స్పష్టం చేశారు.
విద్యుత్ మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా పదివేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకం తర్వాత కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించిందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తున్నామన్నారు. పంటల నిల్వ కోసం గోదాంల నిర్మాణం చేపట్టామని, పంటలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. వరిధాన్యంతో పాటు ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, వీసీ రఘునందన్ రావు, విస్తరణ సంచాలకురాలు డాక్టర్ సుధారాణి, ఈఈఐ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read..