కొత్త రూట్​లో గంజాయి గ్యాంగ్​..

by Sumithra |
కొత్త రూట్​లో గంజాయి గ్యాంగ్​..
X

దిశ, వనస్థలిపురం : పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తుండగా... ఎక్సైజ్ ​స్పెషల్ ​టాస్క్​ఫోర్స్​పోలీసులు నిఘా పెట్టి వారి ఆట కట్టిస్తున్నారు. నిఘా వ్యవస్థలకు సవాల్​ విసురుతూ గంజాయి స్మగ్లర్లు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు కారులో వెళ్తున్నట్లు చిత్రీకరిస్తూ.. చేర్చాల్సిన చోటుకు సరుకును తరలిస్తున్నారు. శుక్రవారం ఇదే ప్లాన్​తో కారులో కుటుంబ సభ్యులతో కలిసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను శుక్రవారం ఎక్సైజ్​స్పెషల్ ​టాస్క్​ఫోర్స్​పోలీసులు పెద్ద అంబర్​పేట ఓఆర్ఆర్ ​వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. హయత్​నగర్​ఎక్సైజ్​ ఎస్​హెచ్​వో వివరాల ప్రకారం నిఘా వర్గాల అలర్ట్​తో.. ఎక్సైజ్​స్పెషల్​టాస్క్​ఫోర్స్​సీఐ నాగరాజు టీమ్‌ పెద్ద అంబర్​పేట ఓఆర్​ఆర్​ వద్ద తనిఖీలు నిర్వహించారు. కారులో ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు ఒడిశా మల్కన్​గిరి, జగ్జల్​దేవ్​పూర్ ​నుంచి వస్తున్న హైదరాబాద్​లో శుభకార్యానికి వెళ్తున్నట్లు చెప్పారు.

కారును చెక్​చేయగా.. గంజాయి బయట పడింది. కారు వెనుక సీటు కింది భాగంలో ప్రత్యేక అరలు చేసి 14 కేజీల గంజాయిని ప్యాకెట్లను అమర్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. గంజాయిని రవాణా చేసే లేడీ డాన్‌ సునీతా దాస్‌ గా గుర్తించారు. జగ్జల్‌దేవ్‌పూర్‌ నుంచి హైదరాబాద్​కు తన కారులో గంజాయిని దూల్​పేటలోని ఒక వ్యాపారికి ఇచ్చేందుకు వెళ్తున్నామని అంగీకరించారు. లేడీడాన్‌ సునీతా దాస్‌తో పాటు కారు డ్రైవర్‌ ఇస్తియా ఖురేషి, కంకన్‌ సన అనే వ్యక్తులను అరెస్ట్​ చేశారు. గంజాయి రవాణకు వినియోగించిన కారు, సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 3.50 లక్షలు, కారు మరో రూ.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ఎస్సై జ్యోతితో పాటు సిబ్బంది ఉన్నారు. నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వోకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ తిరుపతి యాదవ్‌ అభినందించారు.

Next Story