ఓయూలో బీఆర్ఎస్ సంబరాలు

by Dishanational1 |
ఓయూలో బీఆర్ఎస్ సంబరాలు
X

దిశ, సికింద్రాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదించిన సందర్భంగా ఓయూలో టీఆర్ఎస్వీ నాయకులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డిసెంబర్ 9 అనేది కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ ప్రకటన తెచ్చుకున్న రోజని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో దేశంలో కొనసాగుతున్న అరాచక ప్రభుత్వాన్ని దింపి సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక రుగ్మతలను రూపుమాపే దిశగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఫలాలు దేశవ్యాప్తం కావాలంటే తెలంగాణ మోడల్ దేశానికి అవసరమని ఇది బీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, టైగర్ రఘురాం, కార్యదర్శులు చందు, చటారి దశరథ్, మేకల రవి, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజు యాదవ్, కాటం శివ, రమేష్ గౌడ్, నాగేందర్ రావు, బాలెంల అవినాష్, రాజు, నరేష్, మధు, వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read....

'పేదలకు అండ సోనియా గాంధీ'


Next Story