BREAKING: మణికొండలో కారు బీభత్సం.. ఏకంగా 20 బైకులు ధ్వంసం

by Shiva Kumar |
BREAKING: మణికొండలో కారు బీభత్సం.. ఏకంగా 20 బైకులు ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: కారు బీభత్సం సృష్టించిన ఘటనలో 20 ధ్వంసం అయిన ఘటన హైదరాబాద్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద మంగళవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 బైక్‌ల వరకు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో డైవర్ పరార్ అయ్యేందుకు ప్రయత్నించగా కాలనీవాసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కారును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా కారును నడిపిన వ్యక్తిని పోలీసులు మైనర్‌గా గుర్తించారు.



Next Story

Most Viewed