- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
బీహెచ్ఈఎల్ గేట్లు మూసివేత.. అసలు కారణం అదే

దిశ, శేరిలింగంపల్లి : దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమైన సంస్థలకు పటిష్ట రక్షణ కల్పిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని పలు కేంద్ర సంస్థలకు భద్రత కల్పించే పనిలో పడింది. తాజాగా బీహెచ్ఈఎల్ సంస్థ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీయల్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. భద్రతా కారణాల రీత్యా బీహెచ్ఈఎల్ చుట్టూ ఉన్న 9 గేట్లను ఆయా సమయాల్లో మూసివేస్తూ, అవసరం ఉన్న సమయంలోనే తెరిచేందుకు నిర్ణయించినట్టు బీహెచ్ఈఎల్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెయిన్ చెక్ పోస్ట్ ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, రామచంద్రాపురం వైపు ఉన్న శ్రీనివాస్ థియేటర్ గేట్ ను పూర్తిగా మూసివేయనున్నారు. హెచ్ ఐజీ ( జెడ్పీహెచ్ ఎస్ ) రోడ్డును ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు మూసివేయనున్నారు.
అయితే అగ్నిమాపక శకటాలకు, అంబులెన్స్ లకు అవసరాన్ని బట్టి ఓపెన్ చేయనున్నారు. హెచ్ ఐజీ( సుందరవనం) పార్క్ గేట్ తెరిచి ఉంచనున్నారు. ఎల్ ఐజీ గేట్ రోడ్డును ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుండి ఉదయం 5.30 గంటల వరకు మూసివేయనున్నారు. మ్యాక్ సొసైటీ గేట్ ను భద్రతా కారణాల కారణంగా పూర్తిగా మూసివేశారు. సీఐఎస్ ఎఫ్ బ్యారెక్ రోడ్ ను మూసివేశారు. ఎంఐజీ (నెహ్రూ పార్క్) గేట్ రోడ్డును ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు మూసివేయనున్నారు. అయితే అగ్నిమాపక శకటాలకు, అంబులెన్స్ లకు అవసరాన్ని బట్టి ఓపెన్ చేయనున్నారు. ఎంఐజీ ( బుధవారం మార్కెట్ ) రోడ్ గేట్ ను భద్రత కారణాల వల్ల మూసివేస్తున్నట్లు బీహెచ్ఈఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ సురన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.