బీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు
X

దిశ, ఎల్బీనగర్ : బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రమణారెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేదిక దిగి వెళ్లిపోవాలనడం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

అనంతరం రమణారెడ్డి వేదిక దిగి బయటికి వెళుతుండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. దీంతో ఆయన సభా ప్రాంగణం నుంచి పరుగులు తీశారు. అయినా వెంబడించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటాడి మరీ రమణారెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో రమణారెడ్డి షర్ట్ పూర్తిగా చినిగిపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి రమణారెడ్డిని అక్కడి నుంచి పంపించి వేశారు.

నిలువరించాల్సిన ఎమ్మెల్యే ఊగిపోయారు..

ఒకే పార్టీలో ఉన్న మాజీ కార్పొరేటర్ పై తన అనుచరులు దాడి చేస్తున్నా వారిని నిలవరించకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులను ఉసిగొలుపుతూ ఊగిపోయారు. దీంతో మరింత రెచ్చిపోయిన అనుచరులు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు చర్చనీయాంశంగా మారింది.


Next Story