- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రధాని మోడీ పరిపాలనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పొషించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్వీఎల్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందుకు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్, యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జి కృష్ణా అల్లవారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి, జాతీయ నేతలు మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు యువజన కాంగ్రెస్ కృషి మరువలేనిది అన్నారు. దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు యువత త్వరలోనే చరమగీతం పాడాలన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తామని తెలిపారు. యువజన కాంగ్రెస్ కు సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ గుండెకాయ అలాంటిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ, జిల్లా నియోజకవర్గ మండల కమిటీ తదితర నాయకులు పాల్గొన్నారు.