శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి 10 కిలోమీటర్ల మేర డ్రోన్ల ఎగరవేతపై నిషేధం

by Kalyani |
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి 10 కిలోమీటర్ల మేర డ్రోన్ల ఎగరవేతపై  నిషేధం
X

దిశ, శేరిలింగంపల్లి : దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తత ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు చర్యలకు ఉపక్రమించిన పోలీసులు తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీచేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రతలో భాగంగా శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్ జీఐఏ) నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు రిమోట్లీ కంట్రోల్డ్ డ్రోన్‌లు, పారా-గ్లైడర్‌లు లేదా రిమోట్లీ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఎగరడంపై నిషేధం విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా సంబంధిత చట్ట విభాగాల ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు 10.05.2025 నుంచి 09.06.2025 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.



Next Story