- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనం చూస్తుండగానే హత్య.. నడిరోడ్డుపై..

దిశ, ఎల్బీనగర్: ప్రేమ వివాహం చేసుకున్నందుకు వధువు వర్గానికి చెందిన వారు వరుడిని హత్య చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బెదిరింపులకు పాల్పడిన హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. ఓ కార్ల షో రూమ్ లో సేల్స్ మాన్గా పనిచేసే బిల్లా పురం నాగరాజు (25), సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా (23) జనవరి 31వ తేదీన ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి ఇష్టప్రకారమే ప్రేమ వివాహం జరిగింది. అయితే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పినట్లు సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్న మీరు తమకు రక్షణ కావాలని పోలీసులను కూడా ఆశ్రయించారు.
ప్రస్తుతం నవ జంట సరూర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రాత్రి 9 గంటల ఈ సమయంలో బిల్లా పురం నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. సరూర్నగర్ మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి నాగరాజు వాహనాన్ని అడ్డగించి నాగరాజు పై దాడి దాడి చేసి కొట్టి చంపారని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
హిందువులకు రక్షణ లేదా..?
హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి నాయకులు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై నాగరాజును హత్య చేయడం హేయమైన చర్య అన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిందువులపై తప్పుడు కేసులు పెడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు ను నడిరోడ్డులో హత్య చేయడం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు. పెద్ద ఎత్తున బిజెపి నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.