- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జీఓ 317ను సవరించండి.. ఉద్యోగుల మహాధర్నా..
దిశ, ముషీరాబాద్: జీఓ 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ జీఓ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ధ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మాడిశెట్టి తిరుపతిరావు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వర రావు, ఎస్టీయూ నాయకుడు భుజంగరావు, కోశాధికారి వినోద్ తదితరులు మాట్లాడుతూ జీఓ 317 వలన స్థానికత కోల్పోయి సంవత్సర కాలం అవుతుందన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ప్రమోషన్లు చేపడుతున్న తరుణంలో స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానికత కల్పించాలని డిమాండ్ చేశారు.
తాము చలో ప్రగతిభవన్ కార్యక్రమం చేపట్టినప్పుడు సీఎంతో కలవాలి అనుకుంటే మహిళా టీచర్లు అని కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారన్నారు. మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారని, తాము గొంతెమ్మ కోరికలమే కోరడం లేదన్నారు. భార్యాభర్తలను విడ తీయకుండా ఒకే దగ్గర ఉండే విధంగా బదిలీ చేయమని వేడుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మాకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.