- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రేక్షకులను మెప్పించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు
దిశ, అంబర్ పేట్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని పార్లమెంటు సభ్యుడు కనుకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. దేవదాసు చిత్ర సప్తతి వేడుక సందర్భంగా సినీ నటి అనురాధకు అక్కినేని అభినయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవీంద్ర కుమార్ పాల్గొని అనురాధకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకరంగం ద్వారా వెండితెరకు వచ్చి తెలుగు సినిమా తొలినాళ్లో అగ్రనాయకులలో ఒకడుగా నిలిచారని పేర్కొన్నారు.
సుమారు 255 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని కీర్తించారు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారని తెలిపారు. దేవదాసు చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. డాక్టర్ అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో మోహిని, సినిమా జర్నలిస్ట్ పాలకోడేటి సత్యనారాయణ, ప్రముఖ జర్నలిస్టు రెంటాల జయదేవ, సినీ విజ్ఞాన విశారద ఎస్.వీ.రామారావు, సంస్థ అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, సంస్థ కార్యవర్గ సభ్యులు భాగి శివ శంకర శాస్త్రి, ఎంఏ హమీద్ పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని, గాయకుడు వినోద్ బాబు, రేవతి నిర్వహణలో దేవదాసు సినీ సంగీత విభావరి అలరించాయి.