- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీవ్ర విషాదం.. బర్త్ డే రోజే అనంతలోకాలకు
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద దారుణం చోటు చేసుకుంది.సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని తండ్రికి చెప్పి ఇంట్లోంచి బయలుదేరిన ఓ యువతిని అంతలోనే మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన లావణ్య తండ్రి, సోదరుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్లోని తుమ్మలబస్తీలో నివాసం ఉంటున్నారు. లావణ్య ఖైరతాబాద్లో కాల్సెంటర్లో పని చేస్తోంది. బుధవారం ఆఫీస్కు వచ్చే క్రమంలో తుమ్మలబస్తీ నుంచి MMTS రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలు దాటి ఖైరతాబాద్కు వస్తుండగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు తాకడంతో ఆమె ఎగిరి కింద పడింది. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా లావణ్య తండ్రి మాట్లాడుతూ.. ''ఇవాళ తన పుట్టినరోజు. సాయంత్రం మాకు పార్టీ ఇస్తానని చెప్పి, పుట్టినరోజు నాడే ఇలా శాశ్వతంగా వెళ్లిపోయింది.'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.